కేంద్రం వైఖరిపై మండిపడుతూ రాహుల్, ప్రియాంక ట్వీట్స్
ABN , First Publish Date - 2020-09-24T21:31:35+05:30 IST
మూడు వ్యవసాయ బిల్లులు తెచ్చి రైతులకు నష్టం చేసిన మోదీ ప్రభుత్వం... తాజాగా కార్మికులపై
న్యూఢిల్లీ : మూడు వ్యవసాయ బిల్లులు తెచ్చి రైతులకు నష్టం చేసిన మోదీ ప్రభుత్వం... తాజాగా కార్మికులపై పడుతోందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మండిపడ్డారు. ‘‘రైతుల తర్వాత మోదీ ప్రభుత్వం కార్మికులను టార్గెట్ చేసింది. పేదల నుంచి దోపిడీ చేసి స్నేహితులకు పంచిపెడుతున్నారు. ఇదీ మోదీ పరిపాలన..’’ అంటూ రాహుల్ ట్విట్టర్ వేదికగా ఎద్దేవా చేశారు.
జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక ట్వీట్
‘‘చూడండి... బీజేపీ ప్రభుత్వం ప్రాధమ్యాలు. ఉద్యోగాల నుంచి ఉద్యోగులను తొలగించే సులభతర చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రస్తుతానికి కావాల్సింది అందరి జీవితాలకు రక్షణ.’’ అంటూ ప్రియాంక ట్వీట్ చేశారు.