మా అక్కయ్య నీతో మాట్లాడాలంటోందంటూ అర్ధరాత్రి ఆ కుర్రాడిని తీసుకెళ్లాడా మైనర్ బాలుడు.. తెల్లారేసరికి ఊహించని సీన్..!

ABN , First Publish Date - 2022-01-07T21:02:24+05:30 IST

తన అక్కయ్యను, వదినను రోజూ వేధిస్తున్న యువకుడికి బుద్ధి చెప్పాలనుకున్నాడు ఆ కుర్రాడు..

మా అక్కయ్య నీతో మాట్లాడాలంటోందంటూ అర్ధరాత్రి ఆ కుర్రాడిని తీసుకెళ్లాడా మైనర్ బాలుడు.. తెల్లారేసరికి ఊహించని సీన్..!

తన అక్కయ్యను, వదినను రోజూ వేధిస్తున్న యువకుడికి బుద్ధి చెప్పాలనుకున్నాడు ఆ కుర్రాడు.. అర్ధరాత్రి సమయంలో ఆ యువకుడి ఇంటికి వెళ్లి పిలిచాడు.. అక్క రమ్మంటోందని చెప్పి తీసుకెళ్లాడు.. ఊరు అవతలకు తీసుకెళ్లి అక్కడ మరో ముగ్గురితో కలిసి చంపేశాడు.. మృతదేహాన్ని కాలవలో పారేశాడు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నాలుగు రోజుల విచారణ అనంతరం అసలు విషయాన్ని బయటపెట్టారు. 


మధ్యప్రదేశ్‌లోని ధార్ గ్రామానికి చెందిన అజయ్ అనే యువకుడు తన గ్రామానికే చెందిన ఇద్దరు యువతులను రోజూ ఏడిపించేవాడు. అసభ్యకర కామెంట్స్ చేస్తూ హింసించేవాడు. ఆ విషయం తెలియడంతో యువతి సోదరుడు అజయ్‌పై పగ పెంచుకున్నాడు. అతడిని చంపెయ్యాలని పథకం రచించాడు. మరో ముగ్గురిని కూడగట్టుకున్నాడు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి అజయ్ ఇంటికి వెళ్లి పిలిచాడు. 


అక్క రమ్మంటోందని పిలిచి ఊరు అవతలికి తీసుకెళ్లాడు. మద్యం మత్తులో ఉన్న అజయ్‌పై దాడి చేశాడు. అనంతరం తుపాకీతో కాల్చి చంపాడు. మృతదేహాన్ని అక్కడే వదిలిపెట్టి నలుగురూ ఇంటికి వెళ్లిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభిచారు. అజయ్ స్నేహితుడి సాక్ష్యం ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. నిందితులు మైనర్లు కావడంతో వారిని జువైనల్ హోమ్‌కు తరలించారు.   

Updated Date - 2022-01-07T21:02:24+05:30 IST