అయోధ్య, కాశీ తర్వాత మధుర ఆలయాన్ని అభివృద్ధి చేయాలి: బీజేపీ ఎంపీ హేమమాలిని
ABN , First Publish Date - 2021-12-20T13:39:15+05:30 IST
అయోధ్య, కాశీ తర్వాత తన లోక్సభ నియోజకవర్గమైన మథురలో భారీ ఆలయాన్ని నిర్మించాలని బీజేపీ ఎంపీ హేమమాలిని కోరారు...
ఇండోర్: అయోధ్య, కాశీ తర్వాత తన లోక్సభ నియోజకవర్గమైన మథురలో భారీ ఆలయాన్ని నిర్మించాలని బీజేపీ ఎంపీ హేమమాలిని కోరారు. ఇండోర్లో బీజేపీ ఎంపీ హేమమాలిని మీడియాతో మాట్లాడారు. ‘‘రామ జన్మభూమి, కాశీ పునరుద్ధరణ తర్వాత సహజంగా మధుర కూడా చాలా ముఖ్యమైనది, నన్ను కాశీకి ఆహ్వానించారు, నేను సోమవారం కాశీకి వెళుతున్నాను’’ అని ఎంపీ హేమమాలిని చెప్పారు.‘‘ ప్రేమ, ఆప్యాయతలకు ప్రతీక అయిన కృష్ణ భగవానుడి జన్మస్థలం అయిన మధుర ఎంపీగా నేను ఉన్నందున అక్కడ ఒక గొప్ప దేవాలయం ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పటికే ఇక్కడ ఒక దేవాలయం ఉంది. మోదీ జీ అభివృద్ధి చేసిన కాశీ విశ్వనాథ్ కారిడార్ లాగా మధురను అందంగా తీర్చిదిద్దవచ్చు’’ అని హేమమాలిని వివరించారు.
కాశీ విశ్వనాథుని దేవాలయ పునర్ నిర్మాణం చాలా కష్టతరమైందని, గత కొన్నేళ్లుగా ఎవరూ దీన్ని గురించి ఆలోచించలేదన్నారు.రూ.339 కోట్లతో యాత్రి సువిధ కేంద్రాలు, టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్, వేద కేంద్రం, ముముక్షు భవన్, భోగశాల, సిటీ మ్యూజియం, వ్యూయింగ్ గ్యాలరీ, ఫుడ్ కోర్ట్ నిర్మాణం వల్ల శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించే యాత్రికులకు సౌకర్యం ఏర్పడింది.