పెళ్లయిన 16వ రోజే భార్యకు తెలిసిందో షాకింగ్ నిజం.. ఇంత మోసమేంటని ఆమె నిలదీస్తే దాడి చేసిన భర్త.. చివరకు..

ABN , First Publish Date - 2022-09-13T00:28:32+05:30 IST

మనసుకు నచ్చాడని పెళ్లి చేసుకుంది. భర్తతో కలిసి కొత్తింట్లో అడుగు పెట్టింది. 15 రోజులపాటు ఆనందంగా గడిపింది. ఈ క్రమంలో పెళ్లైన 16వ రోజే భర్తకు సంబంధించిన షాకింగ్ నిజం ఆమెకు తెలిసింది. దీంతో ఇంత మోసమేంటని అ

పెళ్లయిన 16వ రోజే భార్యకు తెలిసిందో షాకింగ్ నిజం.. ఇంత మోసమేంటని ఆమె నిలదీస్తే దాడి చేసిన భర్త.. చివరకు..

ఇంటర్నెట్ డెస్క్: మనసుకు నచ్చాడని పెళ్లి చేసుకుంది. భర్తతో కలిసి కొత్తింట్లో అడుగు పెట్టింది. 15 రోజులపాటు ఆనందంగా గడిపింది. ఈ క్రమంలో పెళ్లైన 16వ రోజే భర్తకు సంబంధించిన షాకింగ్ నిజం ఆమెకు తెలిసింది. దీంతో ఇంత మోసమేంటని అతడిని నిలదీసింది. అతడి నుంచి ఊహించని సమాధానం రావడంతో మరింత విస్తుపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందనే పూర్తి వివరాల్లోకి వెళితే..


మధ్యప్రదేశ్‌‌లోని గ్వాలియర్‌కు చెందిన ఓ యువతికి పెళ్లీడు రావడంతో కుటుంబ సభ్యులు ఆమెకు పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే గ్వాలియర్‌లోనే ఓ అబ్బాయిని చూశారు. అతడు మందసౌర్‌ ఎలక్ట్రిక్ కంపెనీలో ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్నాడని తెలుసుకుని.. అతడిని అల్లుడిని చేసుకునేందుకు  ఆసక్తి చూపారు. యువతి, యువకుడు ఒకరికొకరు నచ్చడంతో.. 23 జనవరి 2022న వారి వివాహం జరిగింది. వివాహానంతరం ఆ వరుడు తన భార్యను మందసౌర్‌కు తీసుకెళ్లాడు. అక్కడ ఓ ఇంట్లో నూతన దంపతులు కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఇంతలోనే పెళ్లైన 16వ రోజుకే తన భర్తకు సంబంధించిన దారుణమైన నిజం ఆ యువతికి తెలిసింది. అతడికి ఇది వరకే పెళ్లైందని.. మొదటి భార్యతో విడాకులకు సంబంధించిన కేసు కోర్టు విచారణలో ఉందని తెలిసి షాకైంది. అనంతరం అతడిని నిలదీసింది. 



ఈ క్రమంలో అతడు చేసిన తప్పును ఒప్పుకోకుండా.. క్రూరంగా వ్యవహరించాడు. యువతిని గదిలో బంధించి చిత్రహింసలు పెట్టాడు. అంతేకాకుండా శృంగారం సామర్థ్యాన్ని పెంచుకోవడానికి మాత్రలు ఉపయోగించి మరీ.. ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో అతడి చెర నుంచి దాదాపు 8 నెలల తర్వాత తప్పించుకున్న యువతి.. గ్వాలియర్‌లోని తన పుట్టింటికి చేరుకుంది. తల్లిదండ్రులకు విషయం చెప్పి, భర్తపై ఫిర్యాదు చేయడానికి అత్తమామల వద్దకు వెళ్లింది. అక్కడా ఆమెకు చేదు అనుభవమే ఎదురైంది. తర్వాత మరోసారి భర్తతో మాట్లాడి.. అతడిని మార్చుకునే ప్రయత్నం చేసింది. అదీ విఫలం కావడంతో చేసేదేమీ లేక ఆ యువతి.. పోలీసులను ఆశ్రయించింది. మోసం చేసి పెళ్లి చేసుకోవడంతోపాటు.. తన ఇష్టం పని లేకుండా లైంగిక వాంఛ తీర్చుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న అధికారులు.. దర్యాప్తు ప్రారంభించారు. 


Updated Date - 2022-09-13T00:28:32+05:30 IST