‘ఓర్వకల్లు’కు ఏరోడ్రోమ్ లైసెన్స్: మేకపాటి
ABN , First Publish Date - 2021-01-17T09:28:41+05:30 IST
కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయానికి ఏరోడ్రోమ్ లైసెన్స్ వచ్చినట్టు రాష్ట్ర పరిశ్రమలు, మౌలిక సదుపాయాల కల్పన శాఖల మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి తెలిపారు.
అమరావతి, జనవరి 16(ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయానికి ఏరోడ్రోమ్ లైసెన్స్ వచ్చినట్టు రాష్ట్ర పరిశ్రమలు, మౌలిక సదుపాయాల కల్పన శాఖల మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి తెలిపారు. దక్షిణ భారతదేశంలో పూర్తిగా ప్రభుత్వమే నిర్మిస్తున్న తొలి విమానాశ్రయం ఇదేనని శనివారం ఓ ప్రకటనలో వివరించారు. 2020వ సంవత్సరంలో ఈ విమానాశ్రయం కోసం ప్రభుత్వం రూ.150 కోట్లు వెచ్చించిందన్నారు. ఈ మార్చి నుంచే విమానాశ్రయంలో రాకపోకలు ప్రారంభమవుతాయన్నారు. కాగా, ఇప్పటికే నైట్ ల్యాండింగ్ సిస్టం, పైలట్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాట్లకూ ప్రభుత్వం కృషి చేస్తోందని, తాజాగా కీలకమైన లైసెన్స్ వచ్చిందని ఏపీఏడీసీ ఎండీ వీఎన్ భరత్రెడ్డి సంతోషం వ్యక్తంచేశారు.