మల్లారెడ్డి హత్య నిందితులకు బెయిల్‌ ఇవ్వొద్దు

ABN , First Publish Date - 2022-08-09T05:24:33+05:30 IST

మల్లారెడ్డి హత్య నిందితులకు బెయిల్‌ ఇవ్వొద్దు

మల్లారెడ్డి హత్య నిందితులకు బెయిల్‌ ఇవ్వొద్దు

ములుగు న్యాయవాదుల ఏకగ్రీవ తీర్మానం

ములుగు, ఆగస్టు 8: న్యాయవాది మూలగుండ్ల మల్లారెడ్డిని హత్యచేసిన నిం దితులకు అనుకూలంగా బెయిల్‌ పిటిషన్‌ వెయ్యొద్దని ములుగు జిల్లా బార్‌ అసోసియేషన్‌ సభ్యులు నిర్ణయించు కున్నారు. సోమవారం బార్‌ కార్యా లయంలో సమావేశమైన న్యాయ వాదులు ఈమేరకు ఏకగ్రీవంగా తీర్మానించారు. అలాగే వేరే బార్‌ అసోసియేషన్‌ లాయర్లు పిటిషన్‌ వేస్తే వారికి సహకరించొద్దని నిర్ణయించారు. సమావేశంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బాలుగు చంద్రయ్య, స్వామిదాసు, మహేందర్‌, వినయ్‌కుమార్‌, సునిల్‌కుమార్‌, భిక్షపతి, ప్రతాప్‌, రాజేందర్‌  పాల్గొన్నారు.

Updated Date - 2022-08-09T05:24:33+05:30 IST