సాహస వనిత..!
ABN , First Publish Date - 2021-03-09T16:08:00+05:30 IST
కాంచీపురం జిల్లా శ్రీపెరుంబుదూర్లో ఉన్న 155 అడుగుల ఎత్తున్న కొండపై నుంచి మహిళ కళ్లకు గంతలు కట్టుకొని కిందకు దిగే సాహసం చేసింది. తాంబరం సమీపం ...
155 అడుగుల ఎత్తైన కొండ మీది నుంచి కళ్లకు గంతలతో దిగిన మహిళ
చెన్నై/పెరంబూర్ (ఆంధ్రజ్యోతి): కాంచీపురం జిల్లా శ్రీపెరుంబుదూర్లో ఉన్న 155 అడుగుల ఎత్తున్న కొండపై నుంచి మహిళ కళ్లకు గంతలు కట్టుకొని కిందకు దిగే సాహసం చేసింది. తాంబరం సమీపం మణివాక్కంకు చెందిన ఎన్.ముత్తమిళ్ సెల్వి (36)కి సాహసాలపై ఆసక్తి. శ్రీపెరుంబుదూర్ సమీపంలో 155 అడుగుల ఎత్తుతో మలైపట్టు కొండఉంది. వినూత్న సాహసం చేయాలనే కోరికతో ముత్తమిళ్ సెల్వి ఆదివారం ఉదయం కొండపైకి ఎక్కి, కళ్లకు గంతలు కట్టుకొని తాడు పట్టుకుని కిందకు దిగింది. ఈ సాహసాన్ని పరిశీలించిన ‘యూనికో వైల్డ్ రికార్డ్స్’ సంస్థ ముత్తమిళ్సెల్విన్కు సర్టిఫికెట్ను, బహుమతిని అందజేసింది. ఈ సందర్భం గా ఆమె మాట్లాడుతూ, వారం రోజుల ప్రాక్టీస్ అనంతరం 155 అడుగుల ఎత్తున్న కొండ నుంచి 58 నిముషాల్లో కిందకు దిగానని, మహిళా దినోత్సవాన్ని పురస్కరిం చుకొని ఈ కార్యక్రమం చేపట్టానన్నారు. మహిళలపై జరుగుతున్న అన్యాయాలను పురుషులు కళ్లు మూసుకొని చూడకుండా, కళ్లు తెరచి చూసి మహిళలకు అండగా నిలవడానికి అవగాహన కల్పించేలా ఈ సాహసం చేసినట్టు ఆమె తెలిపారు.