విజయనగరం జిల్లాలో ముందుకొచ్చిన సముద్రం
ABN , First Publish Date - 2021-12-05T02:53:12+05:30 IST
బంగాళాఖాతంలో ఏర్పడిన జవాద్ తుఫాన్ కారణంగా
విజయనగరం: బంగాళాఖాతంలో ఏర్పడిన జవాద్ తుఫాన్ కారణంగా జిల్లాలో సముద్రం ముందుకొచ్చింది. భోగాపురం మండలం ముక్కాంసాగర తీరంలో అలలు అలజడి కల్గిస్తున్నాయి. గ్రామంలోని 30 మీటర్లు వరకు సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. ఒడ్డునున్న పడవలను తాళ్లతో కట్టడానికి మత్స్యకారులు తంటాలు పడుతున్నారు.