టీడీపీతోనే మహిళల అభ్యున్నతి

ABN , First Publish Date - 2021-07-23T05:59:50+05:30 IST

తెలుగుదేశం పార్టీతోనే మహిళల అభ్యున్నతి సాధ్యమని హిందూపురం పార్లమెంట్‌ తెలుగు మహిళ కమిటీ అధ్యక్షురాలు సుబ్బరత్నమ్మ అన్నారు.

టీడీపీతోనే మహిళల అభ్యున్నతి

హిందూపురం, జూలై 22: తెలుగుదేశం పార్టీతోనే మహిళల అభ్యున్నతి సాధ్యమని హిందూపురం పార్లమెంట్‌ తెలుగు మహిళ కమిటీ అధ్యక్షురాలు సుబ్బరత్నమ్మ అన్నారు. గురువారం హిందూపురంలోని ఎమ్మెల్యే నివాసంలో నూతనంగా ఎంపికైన పార్లమెంట్‌, నియోజక వర్గాల తెలుగు మహిళ కమిటీల నాయకులను సన్మానించారు. ఈ సందర్బంగా తెలుగు మహిళలు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు న్యాయం జరగలేదన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు మాత్రం ఇష్టానుసారంగా పెంచేశారన్నారు. ప్రభుత్వం సంక్షేమ పఽథకాల్లో చేయూత, ఫిచన్లుపై సాకులు చూపి అర్హులను మహిళలకు అన్యాయం చేస్తు తొలగిస్తున్నారన్నారు. జగన ప్రభుత్వంపై మహిళల్లో చైతన్యం తీసుకువచ్చి పొరాటం చేసి గద్దే దింపుతామన్నారు. ఈసందర్భంగా టీడీపీ ఆధ్యర్యంలో మహిళ నాయకులను సత్కరించారు. ఈకార్యక్రమంలో హిందూపురం పార్లమెంట్‌ టీడీపీ ప్రధాన కార్యదర్శి అంబికా లక్ష్మీనారాయణ, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి రామాంజినమ్మ, పార్లమెంట్‌ మహిళ ప్రధాన కార్యదర్శి రామసుబ్బమ్మ, టీడీపీ పట్టణ అధ్యక్షుడు రమేష్‌, దుర్గానవీన, రామాంజినేయులు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-07-23T05:59:50+05:30 IST