సీబీఐ దత్తపుత్రుడికి భయం..!

ABN , First Publish Date - 2022-05-15T08:26:19+05:30 IST

వైసీపీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో ప్రజల చేత చీత్కారాలు

సీబీఐ దత్తపుత్రుడికి భయం..!

అబద్ధాలు చెప్పడమే జగన్‌కు తెలిసిన విద్య: నాదెండ్ల 


అమరావతి, మే 14(ఆంధ్రజ్యోతి): వైసీపీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో ప్రజల చేత చీత్కారాలు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకున్న సీబీఐ దత్తపుత్రుడు, సీఎం జగన్‌లో ఆందోళన మొదలైందని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ఆరోపించారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన చేశారు. నోటికి వచ్చిన ఆబద్ధాలు చెప్పడమే జగన్‌కు తెలిసిన విద్య అని ఆరోపించారు. పాదయాత్రలో ముద్దులు పెడుతూ నోటికివచ్చిన హామీలు గుప్పించి మేనిఫెస్టోలో ఎడపెడా చెప్పేసి తీరా వాటి అమలు గురించి ఆడిగితే కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. 2021లో 1.19 లక్షల మందికి మత్స్యకార భరోసా ఇస్తున్నామని చెప్పి, 2022 నాటికి ఆ సంఖ్య 1.08 లక్షలకు తగ్గించిన మాట వాస్తవం కాదా..? అని నిలదీశారు. మహాదాత మల్లాడి సత్యలింగం నాయకర్‌ పేరు పలికే అర్హత సీబీఐ దత్తపుత్రుడికి లేదని తెలిపారు. ఆయన దానం చేసిన ఆస్తులు, భూములు వైసీపీ నేతలు కబ్జా చేస్తున్న విషయం జగన్‌కు తెలియదా..? అని ప్రశ్నించారు. వైసీపీ మేనిఫెస్టోలో చెప్పిన మద్య నిషేధం ఎక్కడ అమలవుతుందో చెప్పాలని నిలదీశారు.  

Updated Date - 2022-05-15T08:26:19+05:30 IST