పాలీసెట్ ఆధారంగా ఆర్జీయూకేటీలో ప్రవేశాలు
ABN , First Publish Date - 2021-06-18T09:45:17+05:30 IST
నిర్మల్ జిల్లా బాసరలోని రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ - ట్రిపుల్ ఐటీ) 2021-22 విద్యాసంవత్సరానికి పాలీసెట్ ర్యాంకుల ఆధారంగా ప్రవేశాలు కల్పించాలని నిర్ణయించింది.
- 30-30-40 ఫార్ములాకు సుప్రీం పచ్చజెండా
- 12వ తరగతికి మార్కుల కేటాయింపుపై స్పష్టత
- జూలై 31లోగా సీబీఎ్సఈ, ఐఎ్సఈ ఫలితాల వెల్లడి
- ఈ నెల 25 వరకు దరఖాస్తుల స్వీకరణ
బాసర, జూన్ 17: నిర్మల్ జిల్లా బాసరలోని రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ - ట్రిపుల్ ఐటీ) 2021-22 విద్యాసంవత్సరానికి పాలీసెట్ ర్యాంకుల ఆధారంగా ప్రవేశాలు కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ గురువారం పాలీసెట్ పరీక్ష రివైజ్డ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం.. ఆర్జీయూకేటీ అందిస్తోన్న ఆరేళ్ల బీటెక్ ఇంటిగ్రేటెడ్ కోర్సులో చేరాలనుకొనే విద్యార్థులు పాలీసెట్ ఎంట్రన్స్ పరీక్ష రాయాలి. 2020-21లో టెన్త్ పాసైన విద్యార్థులు దీనికి దరఖాస్తు చేసుకోవవచ్చు. దరఖాస్తుల స్వీకరణకు జూన్ 25 వరకు గడువుంది. ఆలస్య రుసుముతో ఈ నెల 30వ తే దీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష తేదీని తర్వాత ప్రకటిస్తారు. గత ఏడాది వరకు పదవ తరగతిలో సాధించిన జీపీఏ ఆధారంగా ట్రిపుల్ ఐటీలో సీట్ల భర్తీ జరిగింది. అయితే కరోనా కారణంగా గత ఏడాది, ఈ ఏడాది పదవ తరగతి పరీక్షలు నిర్వహించలేదు. దీంతో.. గ్రేడ్ల ఆధారంగా కాకుండా, పాలీసెట్ ర్యాంకుల ద్వారా ప్రవేశాలకు యూనివర్సిటీ నిర్ణయం తీసుకొంది.