నకలీ బంగారం కుదవ వ్యవహారం కేసు 14కు వాయిదా
ABN , First Publish Date - 2022-08-18T05:46:25+05:30 IST
చిత్తూరు కోఆపరేటివ్ టౌన్బ్యాంకులో నకిలీ బంగారం కుదువ ఉంచి రూ.88 లక్షలు పొందిన వ్యవహారం కేసును కోఆపరేటివ్ డిప్యూటీ రిజిస్ట్రార్ కోర్టు వచ్చేనెల 14వ తేదికి వాయిదా వేసింది.
చిత్తూరు కలెక్టరేట్, ఆగస్టు 17: చిత్తూరు కోఆపరేటివ్ టౌన్బ్యాంకులో నకిలీ బంగారం కుదువ ఉంచి రూ.88 లక్షలు పొందిన వ్యవహారం కేసును కోఆపరేటివ్ డిప్యూటీ రిజిస్ట్రార్ కోర్టు వచ్చేనెల 14వ తేదికి వాయిదా వేసింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా గుర్తించిన అప్పటి బ్యాంకు చైర్మన్ సి.షణ్ముగం బుధవారం కోఆపరేటివ్ డిప్యూటీ రిజిస్ట్రార్ కోర్టుకు హాజరయ్యారు. న్యాయపరంగా ఈ కేసు ఎదుర్కొనేందుకు తన తరపున విచారణలో వాదించేందుకు న్యాయవాదిని ఏర్పాటు చేసుకునేందుకు అనుమతివ్వాలని కోర్టు సర్ఛార్జి అథారిటీ యు.వనజను అభ్యర్థించారు. ఆయన అభ్యర్థనను మన్నించిన కోర్టు కేసును సెప్టెంబరు 14కు వాయిదా వేసింది.