నకలీ బంగారం కుదవ వ్యవహారం కేసు 14కు వాయిదా

ABN , First Publish Date - 2022-08-18T05:46:25+05:30 IST

చిత్తూరు కోఆపరేటివ్‌ టౌన్‌బ్యాంకులో నకిలీ బంగారం కుదువ ఉంచి రూ.88 లక్షలు పొందిన వ్యవహారం కేసును కోఆపరేటివ్‌ డిప్యూటీ రిజిస్ట్రార్‌ కోర్టు వచ్చేనెల 14వ తేదికి వాయిదా వేసింది.

నకలీ బంగారం కుదవ వ్యవహారం కేసు 14కు వాయిదా

చిత్తూరు కలెక్టరేట్‌, ఆగస్టు 17: చిత్తూరు కోఆపరేటివ్‌ టౌన్‌బ్యాంకులో నకిలీ బంగారం కుదువ ఉంచి రూ.88 లక్షలు పొందిన వ్యవహారం కేసును కోఆపరేటివ్‌ డిప్యూటీ రిజిస్ట్రార్‌ కోర్టు వచ్చేనెల 14వ తేదికి వాయిదా వేసింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా గుర్తించిన అప్పటి బ్యాంకు చైర్మన్‌ సి.షణ్ముగం బుధవారం కోఆపరేటివ్‌ డిప్యూటీ రిజిస్ట్రార్‌ కోర్టుకు హాజరయ్యారు. న్యాయపరంగా ఈ కేసు ఎదుర్కొనేందుకు తన తరపున విచారణలో వాదించేందుకు న్యాయవాదిని ఏర్పాటు చేసుకునేందుకు అనుమతివ్వాలని కోర్టు సర్‌ఛార్జి అథారిటీ యు.వనజను అభ్యర్థించారు. ఆయన అభ్యర్థనను మన్నించిన కోర్టు కేసును సెప్టెంబరు 14కు వాయిదా వేసింది.

Updated Date - 2022-08-18T05:46:25+05:30 IST