వైసీపీ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత: ఆదిరెడ్డి భవానీ

ABN , First Publish Date - 2021-12-21T22:02:58+05:30 IST

వైసీపీ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ అన్నారు.

వైసీపీ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత: ఆదిరెడ్డి భవానీ

రాజమండ్రి: వైసీపీ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత  వ్యక్తం అవుతుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ అన్నారు. మంగళవారం రాజమండ్రిలో టీడీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, టీడీపీ నేతలు ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి వాసు హాజరయ్యారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే భవానీ మాట్లాడుతూ.. రాజమండ్రిలో అర్హులైన వారికి ప్రభుత్వం ఫించన్లు ఇవ్వటం లేదన్నారు.నగరంలో శానిటేషన్ అధ్వానంగా ఉందని.. శానిటేషన్ మెరుగుపర్చాలని కమిషనర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. రాజమండ్రి కార్పోరేషన్‌కు ఎన్నికలు నిర్వహిస్తే అన్నివార్డులను టీడీపీ గెలుచుకుంటుందని ఎమ్మెల్యే భవానీ తెలిపారు. 

Updated Date - 2021-12-21T22:02:58+05:30 IST