ఆర్యవైశ్యుల్లో చాలా మంది పేదలున్నారు: ఆదిమూలపు
ABN , First Publish Date - 2020-02-16T20:58:16+05:30 IST
ఆర్యవైశ్యులందరికీ న్యాయం చేసేందుకే కార్పోరేషన్ను సీఎం జగన్ ఏర్పాటు చేశారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. పేదలందరికీ కార్పొరేషన్ తరపున న్యాయం చేయాలన్నారు.
విజయవాడ: ఆర్యవైశ్యులందరికీ న్యాయం చేసేందుకే కార్పోరేషన్ను సీఎం జగన్ ఏర్పాటు చేశారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. పేదలందరికీ కార్పొరేషన్ తరపున న్యాయం చేయాలన్నారు. ఆర్యవైశ్య సంక్షేమ, అభివృద్ధి కార్పోరేషన్ ఛైర్మన్గా కుప్పం ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణస్వీకారానికి మంత్రులు బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాస్, వెల్లంపల్లి శ్రీనివాస్, ఆదిమూలపు సురేష్, శంకర్నారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పథకాలను వివరించారు. రాష్ట్రంలో 10 శాతం ఉన్న ఆర్యవైశ్యుల్లో చాలా మంది పేదలున్నారని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాది వేస్తున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఆర్యవైశ్య కార్పొరేషన్కు వచ్చే బడ్జెట్లో తగిన నిధులు కేటాయిస్తామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆర్యవైశ్య కార్పొరేషన్కు రూ.100 కోట్లకు తగ్గకుండా బడ్జెట్లో నిధులు కేటాయిస్తామని మంత్రి శంకర్నారాయణ హామీ ఇచ్చారు.