లోకేష్ వాఖ్యల్ని ఖండించిన మంత్రి సురేష్
ABN , First Publish Date - 2021-04-22T23:47:31+05:30 IST
లోకేష్ వాఖ్యల్ని ఖండించిన మంత్రి సురేష్
అమరావతి: 9వ తరగతి వరకు మాత్రమే విద్యార్థుల్ని ప్రమోట్ చేశామని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. సీఎం జగన్పై లోకేష్ చేసిన వ్యాఖ్యల్ని ఆయన ఖండించారు. టెన్త్, ఇంటర్ పరీక్షలకు ఇంకా సమయం ఉన్నందున... వాటిని అప్పుడు సమీక్షించాలని నిర్ణయించామని తెలిపారు. జగన్పై లోకేష్ చేస్తున్న కామెంట్లు చూస్తే.. అందరూ ఆయన్ని ఎర్రినాయుడు అంటారని విమర్శించారు. 70 లక్షల మందికి వైరెస్ సోకే ప్రమాదం ఉందని.. లోకేష్ పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారని పేర్కొన్నారు.