డ్రగ్స్ను మొగ్గ దశలోనే తుంచాలని ప్రభుత్వం కఠిన చర్యలు: బాల్కసుమన్
ABN , First Publish Date - 2022-02-04T19:43:30+05:30 IST
: డ్రగ్స్ను మొగ్గ దశలోనే తుంచాలని ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని విప్ బాల్క సుమన్ అన్నారు.
మంచిర్యాల: డ్రగ్స్ను మొగ్గ దశలోనే తుంచాలని ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని విప్ బాల్క సుమన్ అన్నారు. శుక్రవారం బెల్లంపల్లిలో గంజాయి-మత్తు పదార్థాలపై పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో బాల్క సుమన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ అమ్మే వారిపై పీడియాక్ట్ లు నమోదు చేయాలని సీఎం ఆదేశించారని తెలిపారు. పిల్లలు డ్రగ్స్కు బానిసలు కాకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని బాల్కసుమన్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, పోలీస్ కమీషనర్ చంద్ర శేఖర్ రెడ్డి పాల్గొన్నారు.