Adilabad: ట్రాక్టర్ను ఢీకొన్న మినీ లారీ..ముగ్గురు దుర్మరణం
ABN , First Publish Date - 2021-07-17T13:16:01+05:30 IST
జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ను మినీ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు...
ఆదిలాబాద్:జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ను మినీ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన గుడిహత్నూర్ మండలంలోని మన్నూరు వద్ద చోటు చేసుకుంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.