Adilabad: ఇన్స్ట్రాగ్రాంలో వేధింపులు... టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-06-02T18:55:29+05:30 IST
ఇన్స్ట్రాగ్రాంలో వేధింపులకు పదవ తరగతి విద్యార్థిని బలైన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది.
ఆదిలాబాద్: ఇన్స్ట్రాగ్రాంలో వేధింపులకు పదవ తరగతి విద్యార్థిని బలైన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. ఇచ్చోడ మండలం నర్సాపూర్ గ్రామంలో ముస్లే సాక్షి(16) అనే బాలిక... తన పేరు మీద నకిలీ ఐడీలు తయారు చేసి అసభ్యకరమైన సందేశాలు వస్తుండటంతో తీవ్ర మనోవేదనకు గురైంది. వేధింపులు తాళలేక రెండు రోజుల క్రితం ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఐ వాంట్ జస్టీస్ అంటూ తన పేరు మీద నకిలీ ఐడి తయారు చేసిన వారిని గుర్తించి శిక్షించాలని సూసైడ్ నోట్ రాసి బాలిక తనువు చాలించింది. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.