ఆదిలాబాద్ జిల్లాలో ఉద్రిక్తత.. ఆదివాసీలపై పోలీసుల లాఠీచార్జ్

ABN , First Publish Date - 2022-01-03T20:05:48+05:30 IST

గిరిజన యూనివర్శిటీ కోసం ఆదివాసీ సంఘాలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది.

ఆదిలాబాద్ జిల్లాలో ఉద్రిక్తత.. ఆదివాసీలపై పోలీసుల లాఠీచార్జ్

ఆదిలాబాద్ జిల్లా: గిరిజన యూనివర్శిటీ కోసం ఆదివాసీ సంఘాలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు లాఠీ చార్జ్ చేసి తరిమికొట్టారు. గతంలో ప్రతిపాదించిన గిరిజన యూనివర్శిటీని తక్షణమే ఏర్పాటు చేయాలంటూ ఆదివాసీలు ఆందోళనకు దిగారు. కొమరంభీమ్ చౌరస్తాలో జిల్లా కలెక్టర్, ఎస్పీల వాహనాలను అడ్డుకుని నిరసన తెలిపారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. లాఠీచార్జ్ చేసి ఆందోళనకారులను చెల్లాచెదురు చేశారు.

Updated Date - 2022-01-03T20:05:48+05:30 IST