ఆదిలాబాద్‎లో డాక్టర్లతో గొడవకు దిగిన ఎంపీపీ, సర్పంచ్, ఎంపీవో

ABN , First Publish Date - 2021-05-08T17:16:22+05:30 IST

జిల్లాలోని బోధ్‌ ప్రభుత్వాస్పత్రిలో డాక్టర్లకు, ఎంపీపీ, సర్పంచ్, ఎంపీవోల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పీపీఈ కిట్లు ఇవ్వాలని శుక్రవారం రాత్రి ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్లతో

ఆదిలాబాద్‎లో డాక్టర్లతో గొడవకు దిగిన ఎంపీపీ, సర్పంచ్, ఎంపీవో

ఆదిలాబాద్: జిల్లాలోని బోధ్‌ ప్రభుత్వాస్పత్రిలో డాక్టర్లకు, ఎంపీపీ, సర్పంచ్, ఎంపీవోల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పీపీఈ కిట్లు ఇవ్వాలని శుక్రవారం రాత్రి ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్లతో ఎంపీపీ, సర్పంచ్, ఎంపీవో గొడవకు దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరగడంతో ఘర్షణకు దారితీసింది. ఎంపీపీ, సర్పంచ్, ఎంపీవో అడిగిన పీపీఈ కిట్లు లేవు అనడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మద్యం మత్తులో వచ్చి విధులకు ఆటంకం కలిగించి తమని బెదిరించారని సూపరింటెండెంట్ వారిపై ఆరోపించారు. దీంతో ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆస్పత్రికి వద్దకు చేరుకున్న పోలీసులు ఇరువర్గాలకు నచ్చచెప్పి సముదాయించారు.

Updated Date - 2021-05-08T17:16:22+05:30 IST