వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సాధనే లక్ష్యం
ABN , First Publish Date - 2022-06-29T03:34:18+05:30 IST
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆత్మకూరు నియోజకవర్గంలో వైసీపీ అత్యధిక మెజార్టీతో గెలుపొందడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ఇ
-ఎమ్మెల్యే విక్రమ్రెడ్డి
ఆత్మకూరు, జూన్ 29: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆత్మకూరు నియోజకవర్గంలో వైసీపీ అత్యధిక మెజార్టీతో గెలుపొందడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే సైనికుల్లా పనిచేయాలని ఎమ్మల్యే మేకపాటి విక్రమ్రెడ్డి పేర్కొన్నారు. స్థానిక శ్రీధర్ గార్డెన్స్లో మంగళవారం వైసీపీ ప్లీనరీ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చేరెండేళ్లలో పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని కోరారు. ఆత్మకూరును అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు విక్రమ్రెడ్డిని గజమాలతో సన్మానించారు. ముందుగా వైసీపీ జిల్లా అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, ఎంపీ ఆదాల ప్రభాకర్రెడ్డి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్, ప్లీనరీ పరిశీలకురాలు ఆనం అరుణమ్మ, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి, విజయ డెయిరీ ఛైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, నియోజకవర్గ పరిధిలోని ఎంపీపీలు, జడ్పీటీసీ లు, మున్సిపల్ చైౖర్మన్, వైస్చైర్మన్లు, కౌన్సిలర్లు సర్పంచులు, వైసీపీ మండల కన్వీనర్లు, ముఖ్య నేతలు తదితరులు పాల్గొన్నారు.