అభివృద్ధిని చూసే టీఆర్ఎస్లో చేరికలు
ABN , First Publish Date - 2022-07-07T04:54:18+05:30 IST
టీఆర్ఎస్ ప్రభుత్వం చేప ట్టిన అభివృద్ధిని చూసే పలువురు పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి పేర్కొన్నారు.
- ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి
మద్దూర్, జూలై 6 : టీఆర్ఎస్ ప్రభుత్వం చేప ట్టిన అభివృద్ధిని చూసే పలువురు పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండలంలోని నిడ్జింత గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మండల కేంద్రంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వా నించారు. అంతకుముందు మండలంలోని గీతాంజలి ఉన్నత పాఠశాలలో చదివి పది ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి 10 జీపీఏ సాధించిన విద్యార్థులను ఎమ్మెల్యే సన్మానించారు. అదే విధంగా మండలంలోని మోమినాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని గ్రామస్థులు ఎమ్మెల్యేకు వినతి పత్రం అందించారు. పాఠశాలలో గణితం, భౌతికశాస్త్రం, ఇంగ్లీష్ బోధించేందుకు ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థులు నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొందని వాపోయారు. ఆయా కార్యక్రమాల్లో టీఆర్ఎస్ మండల నాయకులు వీరారెడ్డి, శివకుమార్, పాఠశాల ప్రిన్సిపాల్ విజయ్కుమార్, కరస్పాండెంట్ వెంకటయ్య, వైస్ ప్రిన్సిపాల్ మహేశ్, మార్కెట్ కమిటీ చైర్మన్ వీరారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెంకటయ్య పాల్గొన్నారు.