జిల్లా ప్రజల సహకారం మరువలేనిది
ABN , First Publish Date - 2022-01-28T05:38:25+05:30 IST
జిల్లా ప్రజలు, అధికారుల సహకారం ఎప్పటికీ మరిచిపోలేనని బదిలీపై వెళ్తున్న అదనపు కలెక్టర్ రఘురామ్శర్మ అన్నారు.
- బదిలీపై వెళ్తున్న అదనపు కలెక్టర్ రఘురామ్శర్మ
గద్వాల క్రైం, జనవరి 27 : జిల్లా ప్రజలు, అధికారుల సహకారం ఎప్పటికీ మరిచిపోలేనని బదిలీపై వెళ్తున్న అదనపు కలెక్టర్ రఘురామ్శర్మ అన్నారు. జిల్లా కేంద్రంలోని హిమాలయ హోటల్ సమావేశ మందిరంలో గురువారం రాత్రి వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రఘురామ్శర్మను అదనపు కలెక్టర్ శ్రీహర్ష ఘనంగా సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ అదనపు కలెక్టర్గా రఘురామ్శర్మ పరిపాలనలో తనదంటూ ఒక ప్రత్యేక ముద్ర వేశారని చెప్పారు. నిరాడంబరుడిగా, సాత్వికుడిగా పేరు తెచ్చుకున్నారన్నారు. నిష్పక్షపాతంగా బాధ్యతలు నిర్వహించి అందరిచేత మన్ననలు పొందారని తెలిపారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా వీడ్కోలు సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు పాల్గొన్నారు.