కందికొండ మృతి రచయితలకు తీరని లోటు: అద్దంకి దయాకర్

ABN , First Publish Date - 2022-03-13T18:01:27+05:30 IST

కందికొండ మరణం యావత్ తెలుగు రచయితలకు తీరని లోటని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ అన్నారు.

కందికొండ మృతి రచయితలకు తీరని లోటు: అద్దంకి దయాకర్

హైదరాబాద్: ప్రముఖ గీత రచయిత కందికొండ యాదగిరి మృతి యావత్ తెలుగు రచయితలకు తీరని లోటని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ అన్నారు. ఫిలిం ఛాంబర్‌లో కందికొండ పార్ధివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల వాణిని, గాథల్ని ఎన్నో పాటలను రాశారని కొనియాడారు. ప్రజల కోసం నిరంతరం ఆలోచించే ఓ కవి మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం ఇలాంటి కళాకారులను ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇన్ని సినిమా పాటల్ని రాసిన  కందికొండకు కనీసం ఇల్లు లేకపోవడం బాధాకరమన్నారు. ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన కందికొండ కుటుంబాన్ని ఆదుకోవాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. పార్టీ పరంగా కాకుండా వ్యక్తిగతంగా కూడా సహాయం చేస్తామన్నారు. కందికొండ కుటుంబానికి  అద్దంకి దయాకర్ తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Updated Date - 2022-03-13T18:01:27+05:30 IST