చేర్యాలను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలి

ABN , First Publish Date - 2021-04-09T20:23:02+05:30 IST

జిల్లాలోని చేర్యాల పట్టణ కేంద్రంగా నూతన రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేయాలని మాలమహానాడు

చేర్యాలను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలి

సిద్దిపేట: జిల్లాలోని చేర్యాల పట్టణ కేంద్రంగా నూతన రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేయాలని మాలమహానాడు జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు అద్దంకి దయాకర్ డిమాండ్ చేశారు. చేర్యాల ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అద్దంకి మాట్లాడారు. సీఎం సొంత జిల్లాలో ఉన్న చేర్యాల ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించకపోవడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు.


 టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఆత్మబలిదానాలు ఎక్కువయ్యాయని ఆయన ఆరోపించారు. నిజాం రజాకార్లకు ఎదురొడ్డి పోరాడి 128 మంది మరణించిన చరిత్ర కలిగిన వీర భైరాన్‌పల్లిని రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని ఆయన విమర్శించారు. చేర్యాలను రెవెన్యూ డివిజనుగా ఏర్పాటు చేసే పోరాటంలో తాను ముందుంటానని దయాకర్ ప్రకటించారు. 

Updated Date - 2021-04-09T20:23:02+05:30 IST