ముంబై : రాబోయే ఐపీఓ నిధులతో స్థానిక ఫుడ్ బ్రాండ్లను కొనుగోలు చేయాలని అదానీ విల్మార్ యోచిస్తోంది. శుక్రవారం బీఎస్ఈలో అదానీ విల్మార్ (ఎడబ్ల్యుఎల్) షేర్లు వరుసగా రెండో రోజు 5 శాతం అప్పర్ సర్క్యూట్ వద్ద లాక్ కావడంతో రూ. 543.35 వద్ద కొత్త జీవితకాల గరిష్ఠ స్థాయిని తాకింది. ఎన్ఎస్ఈ, బీఎస్ఈల్లో దాదాపు ఏడు లక్షల షేర్ల కొనుగోలు ఆర్డర్లు పెండింగ్లో ఉన్నాయి.
గత వారంలో, ఎస్ అండ్ పీ బీఎస్ఈ సెన్సెక్స్లో 2.3 శాతం పెరుగుదలతో పోలిస్తే అదానీ గ్రూప్ ఎడిబుల్స్ ఆయిల్ కంపెనీ స్టాక్ 30 శాతం పెరిగింది. ప్రతీ షేరు ఇష్యూ ధర రూ. 230 నుండి 136 శాతం జూమ్ చేసింది. ఏడబ్ల్యూఎల్ ప్రారంభ పబ్లిక్ ఆఫర్(ఐపీఓ) ద్వారా రూ. 3,600 కోట్లను సమీకరించింది. అంతేకాకుండా... ఈ ఏడాది ఫిబ్రవరి 8న ప్రారంభమైంది. ఏడబ్ల్యూఎల్ కిచెన్ ఎసెన్షియల్స్లో మార్కెట్-లీడింగ్ పొజిషన్లతో ఉంది. బ్రాండెడ్ ఎడిబుల్ ఆయిల్, గోధుమ పిండి, బియ్యం తదితరాలు దీని ఉత్పత్తులు. మార్కెట్ వాటాను పెంచుకోవడం, మరిన్ని ఎఫ్ఎంసీజీ విభాగాల్లోకి ప్రవేశించడం, వ్యూహాత్మక సముపార్జనల(ఉత్పత్తి/భౌగోళిక పరిధిని విస్తరించడం) లక్ష్యాలుగా ఉన్నాయి.
స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టింగ్ తర్వాత త్రైమాసిక ఫలితాలలో ఏడబ్ల్యూఎల్... నిరుడు డిసెంబరు 31 తో ముగిసిన మూడవ త్రైమాసికంలో దాని ఏకీకృత నికర లాభం రూ. 211 కోట్లలో 66 శాతం క్వార్టర్ ఆన్ క్వార్టర్(క్యూఓక్యూ) వృద్ధిని నివేదించింది. కంపెనీ ఏకీకృత ఆదాయాలు క్యూఓక్యూలో 41 శాతం పెరిగి, రూ.14,379 కోట్లకు చేరుకున్నాయి.
ఈ త్రైమాసికంలో, ఏడబ్ల్యూఎల్ మొత్తం 1.26 మిలియన్ మెట్రిక్ టన్నుల అమ్మకాల పరిమాణాన్ని సాధించింది. వీటిలో ఆహారంతో పాటు ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ 0.17 ఎంఎంటీ వాల్యూమ్లను సాధించింది. కంపెనీ ఐదు కొత్త ఫార్చ్యూన్ మార్ట్ స్టోర్లను ఏర్పాటు చేసుకున్నప్పటికీ, ఆగ్నేయాసియా అంతటా చోటుచేసుకుంటోన్న వృద్ధిలో భాగంగా ఏడబ్ల్యూఎల్, బీఈఓల్ యొక్క హోల్డింగ్ కంపెనీ అయిన అదానీ విల్మార్ పీటీఇ లిమిటెడ్(ఏడబ్ల్యూపీటీఈ)లో 100 శాతం వాటాను తీసుకోవడం ద్వారా బంగ్లాదేశ్ ఎడిబుల్ ఆయిల్ లిమిటెడ్(బీఈఓఎల్)ను కొనుగోలు చేసింనట్లు ఏడబ్ల్యూఎల్ వెల్లడించింది.
ఇవి కూడా చదవండి