అదానీ విల్మార్... మార్కెట్లోకి రేపు...
ABN , First Publish Date - 2022-01-27T00:28:50+05:30 IST
విల్మార్గౌతమ్ అదానీ సారధ్యంలోని ఎఫ్ఎంసీజీఫుడ్ కంపెనీలలో ఒకటైన అదానీ విల్మార్ ఇష్యూ జనవరి 27 న(రేపు... గురువారుం) సబ్స్క్రిప్షన్ ప్రారంభం కానుంది.
హైదరాబాద్ : విల్మార్ గౌతం అదానీ సారధ్యంలోని ఎఫ్ఎంసీజీఫుడ్ కంపెనీలలో ఒకటైన అదానీ విల్మార్ ఇష్యూ జనవరి 27 న(రేపు... గురువారుం) సబ్స్క్రిప్షన్ ప్రారంభం కానుంది. కంపెనీ తన బిఎస్ఇ ఫైలింగ్లో చెబుతున్న లెక్కల ప్రకారం 4.08 కోట్ల ఈక్విటీ షేర్లను యాంకర్ ఇన్వెస్టర్లకు రూ. 230 చొప్పున కేటాయించింది. సింగపూర్ ప్రభుత్వం, మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్, జూపిటర్ ఇండియా ఫండ్, వోల్రాడో వెంచర్ పార్ట్నర్స్ ఫండ్, సొసైటీ జనరల్, కోహెషన్ ఎమ్కె బెస్ట్ ఐడియాస్, విన్రో కమర్షియల్ మరియు డొవెటైల్ ఇండియా ఫండ్ హా పలు కంపెనీలు యాంకర్ బుక్ ద్వారా పెట్టుబడి పెట్టారు.
హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్, నిప్పాన్ లైఫ్ ఇండియా ట్రస్టీ, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ట్రస్టీ మరియు సన్ లైఫ్ ఎక్సెల్ ఇండియా ఫండ్ కూడా యాంకర్ బుక్ లో ఉన్నాయి. అదానీ విల్మార్ తన పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 3,600 కోట్ల సమీకరణను లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఆఫర్లో తన ఉద్యోగులకు రూ. 107 కోట్ల విలువైన షేర్లు సహా కంపెనీ వాటాదారులకు రూ. 360 కోట్ల విలువైన షేర్లను కేటాయిస్తోంది.