CM YS Jagan తో అదానీ సోదరుల సీక్రెట్ భేటీ!
ABN , First Publish Date - 2021-09-13T16:57:07+05:30 IST
పారిశ్రామిక దిగ్గజం గౌతం అదానీ సోదరులు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్...
అమరావతి : పారిశ్రామిక దిగ్గజం గౌతం అదానీ సోదరులు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో సమావేశమయ్యారు. ఆదివారమిక్కడ తాడేపల్లిలోని సీఎం నివాసంలో వారు మర్యాదపూర్వకంగా ఆయన్ను కలిశారని అత్యంత విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే ప్రభుత్వ వర్గాలు అధికారికంగా ధ్రువీకరించడం లేదు. నౌకాశ్రయాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న అదానీలకు ఇటీవల గంగవరం పోర్టును రాష్ట్రప్రభుత్వం కట్టబెట్టిన సంగతి తెలిసిందే. కృష్ణపట్నం రేవును ఇదివరకే వారు చేజిక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో అదానీ సోదరులు సీఎంతో సమావేశం కావడం చర్చనీయాంశమైంది.