అదాని, అంబానీలకు దోచిపెడుతున్న కేంద్రం
ABN , First Publish Date - 2022-09-28T05:22:59+05:30 IST
దేశంలో బీజేపీ ప్రభుత్వం బీద ప్రజలను దోచి ధనికులైన అదాని, అంబానీలకు కట్టపెడుతోందని ఎమ్మెల్యే డాక్టర్ సీ లక్ష్మారెడ్డి అన్నారు.
- పింఛన్ పత్రాలు, బతుకమ్మ చీరల పంపిణీలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
రాజాపూర్, సెప్టెంబరు 27 : దేశంలో బీజేపీ ప్రభుత్వం బీద ప్రజలను దోచి ధనికులైన అదాని, అంబానీలకు కట్టపెడుతోందని ఎమ్మెల్యే డాక్టర్ సీ లక్ష్మారెడ్డి అన్నారు. మండలంలోని మండలంలోని వివిధ గ్రామాల్లో నూతనంగా మంజూరైన పింఛన్ పత్రాలు, మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. మరికొందరికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. మండల కేంద్రంతో పాటు పరిధిలోని ఆయా గ్రామాలకు చెందిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు సుమారు 60 చెక్కులను అందజేశారు. ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ తెలం గాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతీ కార్యకర్త ఇంటికి పెద్ద దిక్కుగా ఉంటున్నారని అన్నారు. ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించిన తిర్మలాపూర్ గ్రామానికి చెందిన లింగయ్య కుటుంబానికి రూ.2 లక్షల పార్టీ బీమా చెక్కును అందజేశారు. ప్రతీ ఆడపడుచు బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ చీరలను అందిస్తున్నారని పేర్కొన్నారు. పింఛన్లు రాని వారు తమకు కూడా త్వరగా వచ్చేలా చూడాలని పలువురు ఎమ్మెల్యేను వేడుకున్నారు. అందరికీ వచ్చేలా చూస్తానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. తిర్మలాపూర్ గ్రామంలోని చెరువులో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వం నుంచి వచ్చిన చేప పిలల్లను వదిలారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, ఎంపీపీ సుశీల, జడ్పీటీసీ మోహన్ నాయక్, వైస్ ఎంపీపీ మహిపాల్ రెడ్డి, ఎంపీటీసీ అభిమన్యురెడ్డి, శేఖర్గౌడ్, చావ్లీ, సర్పంచ్లు బచ్చిరెడ్డి, పెంటయ్య, గంగాధర్ గౌడ్, శ్యాంబాయి, అలివేల, బాలమణి, గోవింద్ నాయక్, రాఘవేందర్ రెడ్డి, మహేశ్వరి, సూధారాణి, మాజీ ఎంపీపీ నర్సింములు, శ్రీశైలం యాదవ్, ఆనంద్ గౌడ్, వెంకటయ్య గౌడ్, నారాయణ గౌడ్, మల్లేష్ గౌడ్, తహసీల్దార్ రాంబాయి, ఎంపీడీవో లక్ష్మీదేవి, ఎంపీవో రాములు, ఏవో నరేందర్, నాయకులు, మహిళలు పాల్గొన్నారు.