ఐపీఎల్ నుంచి ఆడమ్ మిల్నే అవుట్.. శ్రీలంక పేసర్‌తో సీఎస్‌కే ఒప్పందం

ABN , First Publish Date - 2022-04-21T21:25:34+05:30 IST

గాయంతో బాధపడుతున్న చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ ఆడమ్ మిల్నే ఐపీఎల్ మొత్తానికి దూరమయ్యాడు

ఐపీఎల్ నుంచి ఆడమ్ మిల్నే అవుట్.. శ్రీలంక పేసర్‌తో సీఎస్‌కే ఒప్పందం

ముంబై: గాయంతో బాధపడుతున్న చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ ఆడమ్ మిల్నే ఐపీఎల్ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో అతడి స్థానాన్ని శ్రీలంక పేసర్ మతీషా పతిరనతో ఫ్రాంచైజీ భర్తీ చేసింది. ఈ మేరకు అతడితో సీఎస్కే ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఐపీఎల్ అధికారికంగా తెలిపింది.


19 ఏళ్ల మీడియం పేసర్ అయిన మతీషా 2020, 2022లలో జరిగిన అండర్-19 ప్రపంచకప్‌లలో శ్రీలంకకు ప్రాతినిధ్యం వహించాడు. సీఎస్కే అతడితో రూ. 20 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఐపీఎల్ తెలిపింది. లసిత్ మలింగ బౌలింగ్ యాక్షన్‌ను తలపించేలా బంతులు విసిరే మతీషా ఇప్పటి వరకు రెండు టీ20లు మాత్రమే ఆడాడు.  

Updated Date - 2022-04-21T21:25:34+05:30 IST