అదానీ... 750 మిలియన్‌ డాలర్ల సేకరణ

ABN , First Publish Date - 2021-07-27T22:10:43+05:30 IST

గ్లోబల్‌ ఇన్వెస్టర్ల నుంచి అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (ఏపీఎస్‌ఈజెడ్) సుమారు 750 మిలియన్‌ డాలర్లను సేకరించింది.

అదానీ... 750 మిలియన్‌ డాలర్ల సేకరణ

అహ్మదాబాద్ : గ్లోబల్‌ ఇన్వెస్టర్ల నుంచి అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (ఏపీఎస్‌ఈజెడ్) సుమారు 750 మిలియన్‌ డాలర్లను సేకరించింది. ఇరవై సంవత్సరాలు,10.5 సంవత్సరాల బాండ్ల వాటాల నుంచి అసురక్షిత యూఎస్‌డీ నోట్లను జారీ చేయడం ద్వారా ఈ నిధులను సేకరించింది.


కాగా... అదానీ పోర్ట్‌ సెజ్‌లు నిన్నటి(2021 జూలై 26) నుంచి షేర్లను  జారీచేయడం నిలిపివేశారు. ఈ షేర్లు మూడు సార్లకు పైగా సబ్‌స్రైబ్‌ అయ్యాయి. కాగా... విదేశీ పెట్టుబడిదారుల నుంచి అదానీ పోర్ట్‌ సెజ్‌ల రుణ నిష్పత్తి 69 73 శాతానికి పెరిగిందని కంపెనీ పేర్కొంది. 

Updated Date - 2021-07-27T22:10:43+05:30 IST