వరిలో అగ్గితెగులుతో అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2020-10-02T08:18:03+05:30 IST

ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో అధిక ఉక్కబోత కారణంగా అగ్గితెగులు దోమ ఉధృతి పెరిగే ప్రమాదముందని, ..

వరిలో అగ్గితెగులుతో అప్రమత్తంగా ఉండాలి

సర్పవరం జంక్షన్‌, అక్టోబరు 1: ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో అధిక ఉక్కబోత కారణంగా అగ్గితెగులు దోమ ఉధృతి పెరిగే ప్రమాదముందని, పంటను కాపాడుకునేందుకు నిరంతర పర్యవేక్షణతోపాటు తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలని వ్యవసాయశాఖ ఏడీ జి.పద్మశ్రీ కోరారు. కాకినాడ రూరల్‌ మండలం సర్పవరంలో గురువారం పొలంబడిపై రైతులతో అవగాహన సమావేశం నిర్వహించారు. పొలం పరిసరాల పరిశీలన, మానవాళిపై పురుగుల మందుల ప్రభావంపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏవో సురేష్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-10-02T08:18:03+05:30 IST