మైగ్రేన్కు ఆక్యుపంక్చర్తో చెక్!
ABN , First Publish Date - 2020-03-27T06:44:42+05:30 IST
మైగ్రేన్తో బాధపడేవారికి ఆక్యుపంక్చర్ వల్ల తలనొప్పి తీవ్రత తగ్గుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. చైనాలో హువాజాంగ్ వర్సిటీ శాస్త్రవేత్తలు సగటున ..
బీజింగ్, మార్చి 26: మైగ్రేన్తో బాధపడేవారికి ఆక్యుపంక్చర్ వల్ల తలనొప్పి తీవ్రత తగ్గుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. చైనాలో హువాజాంగ్ వర్సిటీ శాస్త్రవేత్తలు సగటున 37ఏళ్ల వయసున్న 137 మందిపై దాదాపు రెండేళ్ల పాటు పరిశోధనలు జరిపి ఈ విషయాన్ని వెల్లడించారు. మైగ్రేన్కు ఇప్పటికే మందులు ఉన్నప్పటికీ అవి అందరిపై ప్రభావవంతంగా పని చేయడం లేదన్నారు. మందులతో పోల్చితే ఆక్యుపంక్చర్ వల్ల వీరిలో తలనొప్పి తీవ్రత గణనీయంగా తగ్గిందన్నారు. ముందస్తు జాగ్రత్తలో భాగంగా వైద్యులు రోగులకు ఆక్యుపంక్చర్ను సూచించవచ్చన్నారు.