శ్యామ్ కె.నాయుడుపై నటి శ్రీసుధ మళ్లీ ఫిర్యాదు

ABN , First Publish Date - 2021-02-26T00:08:50+05:30 IST

కెమెరామన్ శ్యామ్ కె.నాయుడుపై నటి శ్రీసుధ విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కనకదుర్గ ఫ్లైఓవర్‌పై తన కారును ..

శ్యామ్ కె.నాయుడుపై నటి శ్రీసుధ మళ్లీ ఫిర్యాదు

కృష్ణా: కెమెరామన్ శ్యామ్ కె.నాయుడుపై నటి శ్రీసుధ విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కనకదుర్గ ఫ్లైఓవర్‌పై తన కారును ఢీకొట్టి హత్యాయత్నం చేశారని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. శ్యామ్ కె.నాయుడుపై శ్రీసుధ అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటికే హైదరాబాద్ బంజారాహిల్స్‌లో శ్యామ్‌ కె.నాయుడుపై శ్రీసుధ చీటింగ్ కేసు పెట్టారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్ కేసుకు, విజయవాడ ఘటనకు లింకులున్నాయని పోలీసులకు ఆమె తెలిపారు. తనను హత్య చేసే ప్రయత్నం చేశారని, శ్యామ్ కె.నాయుడుపై చర్యలు తీసుకోవాలని శ్రీసుధ కోరారు. 



Updated Date - 2021-02-26T00:08:50+05:30 IST