నేనెవ్వరినీ కిడ్నాప్ చేయలేదు: కరాటే కల్యాణి

ABN , First Publish Date - 2022-05-17T03:06:34+05:30 IST

తానెవ్వరినీ కిడ్నాప్ చేయలేదని నటి కరాటే కల్యాణి అన్నారు. చిన్నారులను కిడ్నాప్ చేశారని, అందుకే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని వస్తున్న ఆరోపణలపై..

నేనెవ్వరినీ కిడ్నాప్ చేయలేదు: కరాటే కల్యాణి

హైదరాబాద్: తానెవ్వరినీ కిడ్నాప్ చేయలేదని నటి కరాటే కల్యాణి అన్నారు. చిన్నారులను కిడ్నాప్ చేశారని, అందుకే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని వస్తున్న ఆరోపణలపై ఆమె స్పందించారు. మీడియా ముందుకు వచ్చిన కరాటే కల్యాణి తానెక్కడికీ పారిపోలేదన్నారు. పాపకు సంబంధించిన పూర్తి ఆధారాలను వెల్లడిస్తానని తెలిపారు. మంగళవారం కలెక్టర్‌కు అన్ని అధారాలు అందజేస్తానని కరాటే కల్యాణి స్పష్టం చేశారు. 


‘‘నేను అన్యాయాన్ని సహించలేను...ప్రతి అంశంపై స్పందిస్తా. అందుకే నేను కొందరికి నచ్చకపోవచ్చు. నాకు అన్యాయం జరుగుతోంది.. జరుగుతూనే ఉంది. ఎన్ని కుట్రలు చేసినా నేను జడుసుకోను. ఎవరికీ అన్యాయం చేయలేదు, చేయబోను. కల్యాణి మోసం చేసింది అంటే ఆధారాలు చూపించండి. పిల్లలను అమ్ముకుంటే నాకు చూపించండి. నేను సినిమా వాళ్లకు పిల్లలను అమ్ముకున్నానని అంటున్నారు.. అంత నీచమైన స్థాయి నాది కాదు. అబద్దం  చెప్పాల్సిన అవసరం లేదు . నేను ఎటూ పారిపోలేదు.  ఫోన్ ప్రాబ్లమ్ ఉండటం వల్ల స్విచ్చాఫ్ అయింది. అందుకే ఎవరికీ అందుబాటులోకి రాలేదు. మీకు నా చావు కావాలి అంటే నేనే సంతోషంగా చచ్చిపోతా.  నేను ఫైట్ చేస్తుంటే నన్ను ఎదుర్కోలేక పోతున్నారా?. సింగరేణిలో పాప అఘాయిత్యం గురించి మాట్లాడితే పొక్సో కేసు పెట్టారు. పిల్లలను అమ్ముకునే హేయమైన పరిస్థితిలో నేను లేను. నేను పారిపోయే రకం కాదు పరిగెట్టించే రకం. నాకు పిల్లలంటే ఇష్టం..  నాకు పిల్లలు పుట్టలేదు కాబట్టి నేను దత్తత తీసుకోవాలనుకున్నా.’’ అని కరాటే కల్యాణి  చెప్పారు. 


ఆడపిల్లలంటే తనకు ఇష్టమ.. అందుకే పాపము దత్తత తీసుకున్నానని కరాటే కల్యాణి తెలిపారు.  తాను ఎవరినీ కిడ్నాప్ చేయలేదని.. అడాప్ట్ చేసుకోలేదని ఆమె చెప్పారు. సంవత్సరం తర్వాత దత్తత ప్రాసెస్ చేద్దామని అనుకున్నామని ..  తన తల్లి  ఏ విషయాలు చెప్పమని కరాటే కల్యాణి చెప్పారు. ‘‘నేను పిల్లను పెంచుకుంటున్న విషయంపై మా అమ్మకు క్లారిటీ లేదు. శ్రీకాంత్ రెడ్డి దాడి రోజు ఇంట్లో ఎవరూ లేరు కాబట్టి నేను పాపను తీసుకుని వెళ్ళా. గొడవ జరిగిన రోజు పాపను ఉద్దేశ్యపూర్వకంగా తీసుకెళ్లలేదు. పాపను సంవత్సరం తర్వాత నేను అధికారికంగా దత్తత తీసుకుంటా. శివశక్తి అనే సంస్థ నాపై ఇదంతా చేయిస్తుంది. ఇల్లు కొనుగోలు విషయంలో నన్ను మోసం చేశారు. అందుకే నేను సూసైడ్ చేసుకుంటా అని వీడియో పంపాను. ఆ సమయంలో అతను కూడా చస్తా అని అన్నాడు.. ఆ తర్వాత నేను ఘట్కేసర్‌తో పాటు దమ్మాయిగుడ పీఎస్‎లో పిర్యాదు చేశా. నాకు ఎలాంటి నోటీసులు రాలేదు... నోటీసులు ఇచ్చాం ఆన్న మాట నిజం కాదు. పోర్న్ కంటెంట్‌పై తీవ్ర స్థాయిలో పోరాటం చేయబోతున్నా. నేను బీజేపీలో ఉన్నా...అందుకే రాజకీయ కుట్ర కూడా ఉంది. నా దగ్గర ఉన్న బాలుడు కోళ్ల గూడులో దొరికితే పెంచాను. ప్రస్తుతం ఆ అబ్బాయి ఇంటర్నేషనల్ స్కూల్‎లో చదువుతున్నాడు.’’ అని కరాటే కల్యాణి తెలిపారు. 




Updated Date - 2022-05-17T03:06:34+05:30 IST