శ్రీవారి సేవలో సినీనటుడు రాజేంద్రప్రసాద్
ABN , First Publish Date - 2020-07-01T08:31:43+05:30 IST
కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తున్న తరుణంలో లోకకల్యాణం కోసం సుందరకాండ పారాయణ చేపట్టిన టీటీడీకి ప్రముఖ సినీనటుడు రాజేంద్రప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు.
తిరుమల, జూన్ 30: కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తున్న తరుణంలో లోకకల్యాణం కోసం సుందరకాండ పారాయణ చేపట్టిన టీటీడీకి ప్రముఖ సినీనటుడు రాజేంద్రప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు. మంగళవారం ఉదయం ఆయన వీఐపీ బ్రేక్లో శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత నాదనీరాజనం వేదికపై నిర్వహిస్తున్న సుందరకాండ పారాయణంలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈ పారాయణం ఫలితంగా తప్పకుండా కరోనా నుంచి విముక్తి కలుగుతుందనే నమ్మకం తనకు ఉందన్నారు. ప్రజలందరూ తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించి ఆరోగ్యం కాపాడుకోవాలని సూచించారు.