టీడీపీ పటిష్టతకు కార్యకర్తలు కృషి చేయాలి : బీకే

ABN , First Publish Date - 2022-08-09T05:25:40+05:30 IST

టీడీపీ బలోపేతానికి, సభ్యత్వ నమోదుకు కార్యకర్తలు సమష్టిగా కృషిచేయాలని హిందూపురం పార్లమెంట్‌ పార్టీ అధ్యక్షుడు బీకే పార్థసారథి కోరారు.

టీడీపీ పటిష్టతకు కార్యకర్తలు కృషి చేయాలి : బీకే
సమావేశంలో మాట్లాడుతున్న పార్థసారథి

గోరంట్ల, ఆగస్టు 8: టీడీపీ బలోపేతానికి, సభ్యత్వ నమోదుకు కార్యకర్తలు సమష్టిగా కృషిచేయాలని హిందూపురం పార్లమెంట్‌ పార్టీ అధ్యక్షుడు బీకే పార్థసారథి కోరారు.  సో మవారం ఆయన స్థానికంగా పార్టీ నాయకులతో సమావేశమై మాట్లాడారు. పట్టణంలో వార్డుస్థాయి నాయకత్వం సరిగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. సమర్థవంతులైన బూత కన్వీనర్లను నియమించి పార్టీని మరింత పటిష్టం చేయాలన్నారు. సభ్యత్వ నమోదుతో కలిగే ప్రయోజనాలను వివరించారు. కార్యక్రమంలో టీడీపీ కన్వీనర్‌ సోమశేఖర్‌, నాయకులు కొత్తపల్లి నరసింహప్ప, అశ్వర్థరెడ్డి, ఉత్తంరెడ్డి, గిరిధర్‌గౌడ్‌, వేణుగోపాల్‌, సుబ్బరాయుడు, రాజారెడ్డి, వెంకటరెడ్డి పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-09T05:25:40+05:30 IST