కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలి
ABN , First Publish Date - 2021-10-17T05:59:23+05:30 IST
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి హర్కార వేణుగోపాల్రావు పిలుపునిచ్చారు.
- టీపీసీసీ ప్రధాన కార్యదర్శి హర్కార వేణుగోపాల్రావు
కళ్యాణ్నగర్, అక్టోబరు 16: కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి హర్కార వేణుగోపాల్రావు పిలుపునిచ్చారు. శనివారం గోదావరిఖని ఐఎన్టీయూసీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన పూదరి సత్తయ్యగౌడ్, కార్యదర్శిగా నియమితులైన ఎండీ రహీంను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి మారుపేరు అని, జిలాలో కాంగ్రెస్ కార్యకర్తలకు, ప్రజలకు ఎళ్లప్పుడూ అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పీసీసీ మాజీ సభ్యులు గుమ్మడి కుమారస్వామి, కార్పొరేటర్ ముస్తాఫా, నాయకులు వంగ లక్ష్మిపతిగౌడ్, తిప్పారపు శ్రీను, గట్ల రమేష్, వీరబోయిన రవికుమార్యాదవ్, వాజిద్ఖాన్, నాయిని ఓదెలుయాదవ్, సాగర్, కళ్యాణి సంహాచలం, అప్పాసి శ్రీనివాస్, సింగం కిరణ్, రాయమల్లు పాల్గొన్నారు.