కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలి

ABN , First Publish Date - 2021-10-17T05:59:23+05:30 IST

కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి హర్కార వేణుగోపాల్‌రావు పిలుపునిచ్చారు.

కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలి
నాయకులను సన్మానిస్తున్న హర్కార వేణుగోపాల్‌

- టీపీసీసీ ప్రధాన కార్యదర్శి హర్కార వేణుగోపాల్‌రావు

కళ్యాణ్‌నగర్‌, అక్టోబరు 16: కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి హర్కార వేణుగోపాల్‌రావు పిలుపునిచ్చారు. శనివారం గోదావరిఖని ఐఎన్‌టీయూసీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన పూదరి సత్తయ్యగౌడ్‌, కార్యదర్శిగా నియమితులైన ఎండీ రహీంను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ అభివృద్ధికి మారుపేరు అని, జిలాలో కాంగ్రెస్‌ కార్యకర్తలకు, ప్రజలకు ఎళ్లప్పుడూ అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పీసీసీ మాజీ సభ్యులు గుమ్మడి కుమారస్వామి, కార్పొరేటర్‌ ముస్తాఫా, నాయకులు వంగ లక్ష్మిపతిగౌడ్‌, తిప్పారపు శ్రీను, గట్ల రమేష్‌, వీరబోయిన రవికుమార్‌యాదవ్‌, వాజిద్‌ఖాన్‌, నాయిని ఓదెలుయాదవ్‌, సాగర్‌, కళ్యాణి సంహాచలం, అప్పాసి శ్రీనివాస్‌, సింగం కిరణ్‌, రాయమల్లు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-17T05:59:23+05:30 IST