కార్యకర్తలు కేసులకు భయపడవద్దు: చంద్రబాబు

ABN , First Publish Date - 2021-02-26T02:06:51+05:30 IST

కార్యకర్తలు కేసులకు భయపడవద్దని తాను చూసుకుంటానని టీడీపీ అధినేత చంద్రబాబు భరోసా ఇచ్చారు.

కార్యకర్తలు కేసులకు భయపడవద్దు: చంద్రబాబు

కుప్పం: కార్యకర్తలు కేసులకు భయపడవద్దని తాను చూసుకుంటానని టీడీపీ అధినేత చంద్రబాబు భరోసా ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వం వచ్చినవెంటనే కేసులు మొత్తం మాఫీచేస్తామని ప్రకటించారు. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం రావనకాష్టంగా మార్చిందని ధ్వజమెత్తారు. ప్రజల కోసం పెట్టినపార్టీ తెలుగుదేశం అని చెప్పారు. రాష్ట్రానికి స్ఫూర్తిగా నిలిచిన కుప్పం నియోజకవర్గంలో రౌడీయిజం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని దుయ్యబట్టారు. గత ప్రభుత్వం చేపట్టిన పనులను అర్ధాంతరంగా నిలిపేశారని తప్పుబట్టారు. రాష్ట్రాన్ని తన సొంత కుటుంబంలా చూసుకున్నానని, తన కుటుంబాన్ని కూడా పట్టించుకోలేదని చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు రాష్ట్రం పడుతున్న ఇబ్బందులు చూస్తే కడుపు తరుక్కుపోతోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2021-02-26T02:06:51+05:30 IST