కార్యకర్తలే పార్టీకి కీలకం
ABN , First Publish Date - 2022-07-04T05:13:40+05:30 IST
గ్రామాలలో కార్యకర్తలు పార్టీకి కీలకమని ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి అన్నా రు.
- ఎమ్మెల్యే మనోహర్రెడ్డి
సుల్తానాబాద్, జూలై 3: గ్రామాలలో కార్యకర్తలు పార్టీకి కీలకమని ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి అన్నా రు. స్థానిక వైశ్యా భవన్లో ఆదివారం టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులతో ఎమ్మెల్యే సమావేశం నిర్వ హించి వారికి పలు సలహాలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాయకులు గ్రామాల్లో కార్యకర్తలకు గౌరవం ఇవ్వాలని, కార్యకర్తలు యాక్టివ్గా ఉంటేనే పార్టీ పటిష్టంగా ఉంటుందన్నారు. గెలిచిన ప్రజాప్రతినిదులు ప్రభుత్వ పథకాల గురించి ప్రచారం చేయాలన్నారు. ఏ ఎన్నిక వచ్చినా టీఆర్ఎస్ గెలుస్తుందనే దీమాను కార్యకర్తలు, నాయకులు వ్యక్తం చేస్తూ ఉండాలన్నారు. పార్టీలో ఉన్న చిన్నచిన్న విష యాలను సమస్యలను ప్రజల మధ్యన ప్రస్తావించవద్ద ని, ఏ సమస్య ఉన్నా కార్యకర్తలు కానీ నాయకులు కానీ తనతో సంప్రదించాలన్నారు. అందరూ సమైక్యం గా ఉంటూ పార్టీ కోసం పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఎంపీపీ బాలాజీరావు, కేడీసీసీబీ డైరక్టర్ శ్రీగిరి శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర శ్రీనువాస్ గౌడ్, పార్టీ మండల అధ్య క్షులు పురం ప్రేంచందర్రావు, కన్వీనర్ డీకొండ భూమేష్, పట్టణ అధ్యక్షులు పారుపల్లి గుణపతి మార్కెట్ వైస్చైర్మ న్ అన్నేడి మహిపాల్రెడ్డి దయాకర్ ముత్యం రమేష్ గౌడ్తో పాటు సర్పంచులు ఎంపీటీసీలు నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు.