చురుగ్గా మంచినీటి పైప్‌లైన్‌ పనులు

ABN , First Publish Date - 2021-04-17T05:01:04+05:30 IST

మండల పరిధిలోని మేజర్‌ పంచాయతీయైున దొమ్మరనంద్యాలలో ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా పెన్నానది నుంచి నూతనంగా కొత్తపైప్‌లైన్‌ వేస్తున్నట్లు ఆర్‌డబ్యూఎస్‌ ఏఈ సుధీర్‌ తెలి పారు.

చురుగ్గా మంచినీటి పైప్‌లైన్‌ పనులు

మైలవరం, ఏప్రిల్‌ 16 :మండల పరిధిలోని మేజర్‌ పంచాయతీయైున దొమ్మరనంద్యాలలో ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా పెన్నానది నుంచి నూతనంగా కొత్తపైప్‌లైన్‌ వేస్తున్నట్లు ఆర్‌డబ్యూఎస్‌ ఏఈ సుధీర్‌ తెలి పారు. శుక్రవారం గ్రామ సమీపాన ఉన్న మంచినీటి ట్యాంక్‌ నుంచి పెన్నానదిలో బోరు వద్దకు ఉన్న పాతపైప్‌లైన్‌ స్థానంలో కొత్తపైప్‌లైన్‌ను వేస్తున్నారు. మైలవరం జలాశ యం నుంచి పెన్నానదికి  రెండు నెలల క్రితం భారీగా నీరువిడుదల చేయడంతో పైప్‌లైన్లు నీటిలో కొట్టుకుపోయా యి. దీంతో  ప్రస్తుతం ఆరు బోర్ల ద్వారా గ్రామ ప్రజలకు నీటి సమస్య రాకుండా దాదాపు రూ.3 లక్షలతో సర్పంచ్‌ ఆధ్వర్యంలో మరమ్మతు పనులు చురుగ్గా సాగుతున్నాయి. రెండు రోజుల్లో  పనులు పూర్తయ్యే అవకాశం ఉంది.

Updated Date - 2021-04-17T05:01:04+05:30 IST