చురుగ్గా సెంట్రల్‌ లైటింగ్‌ పనులు

ABN , First Publish Date - 2022-05-25T05:08:17+05:30 IST

హైదరాబాద్‌-శ్రీశైలం జాతీయ రహదారిపై

చురుగ్గా సెంట్రల్‌ లైటింగ్‌ పనులు
ఆమనగల్లుకు చేరుకున్న లైటింగ్‌ స్తంభాలు

ఆమనగల్లు, మే 24: హైదరాబాద్‌-శ్రీశైలం జాతీయ రహదారిపై సెంట్రల్‌ లైటింగ్‌ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఏడేళ్ల క్రితం ఆర్‌అండ్‌బీ శాఖలో ఉన్న ఈరోడ్డును జాతీయ రహదారిగా విస్తరించి ఆధునికీకరించారు. కాగా అప్పట్లో సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేయలేదు. దీంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటుండడంతో స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రయాణికుల విన్నపం మేరకు ఎన్‌హెచ్‌ఏఐ సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటుకు నిధులు మంజూరు చేసింది. దీంతో ఆమనగల్లు, కడ్తాల్‌, మైసిగండి, విఠాయిపల్లిలో సెంట్రల్‌ లైటింగ్‌ పనులు చురుకుగా సాగుతున్నాయి. ఇప్పటికే లైటింగ్‌ ఏర్పాటుకు దిమ్మెలను సిద్ధంచేశారు. మంగళవారం లైటింగ్‌ కోసం స్తంభాలు చేరుకున్నాయి.  



Updated Date - 2022-05-25T05:08:17+05:30 IST