8 లక్షల దిగువకు యాక్టివ్ కేసులు
ABN , First Publish Date - 2021-06-19T06:52:25+05:30 IST
దేశంలో కరోనా యాక్టివ్ కేసులు 8 లక్షల దిగువకు వచ్చాయి. వరుసగా 36 రోజుల నుంచి రికవరీలు అధికంగా ఉండటంతో యాక్టివ్ల తగ్గుదల కొనసాగుతోంది. గురువారం 62,480
దేశంలో కొత్తగా 62 వేల కేసులు
వైరస్తో మరో 1,587 మంది మృతి
న్యూఢిల్లీ/లండన్, జూన్ 18: దేశంలో కరోనా యాక్టివ్ కేసులు 8 లక్షల దిగువకు వచ్చాయి. వరుసగా 36 రోజుల నుంచి రికవరీలు అధికంగా ఉండటంతో యాక్టివ్ల తగ్గుదల కొనసాగుతోంది. గురువారం 62,480 మందికి వైరస్ నిర్ధారణ అయింది. 90 వేల మంది కోలుకున్నారు. ప్రస్తుతం 7.98 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరణాలు సైతం 2 వేల లోపునకు పడిపోయాయి. తాజాగా 1,587 మంది చనిపోయినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గత 61 రోజుల్లో ఇవే అత్యల్పం. కాగా.. మనిషి కదలికలు, జ్ఞాపకశక్తి, భావోద్వేగాలకు సంబంధించిన అంశాల్లో అత్యంత కీలకపాత్ర పోషించే మెదడులోని బూడిద పదార్థం (గ్రే మ్యాటర్)పై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోందని యూకే బయోబ్యాంక్ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. తీవ్ర ఇన్ఫెక్షన్ వల్ల గ్రేమ్యాటర్ సహా బ్రెయిన్ టిష్యూలు తగ్గిపోతున్నాయని వారు పేర్కొన్నారు. ఆ అధ్యయన ఫలితం మెడ్ఆర్కైవ్లో జర్నల్లో ప్రచురితమైంది.