పథకాల అమలులో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
ABN , First Publish Date - 2021-06-18T04:47:49+05:30 IST
ప్రభుత్వం ప్రవేశపెడు తున్న సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠినచర్యలు తీసుకుంటామని అద నపుకలెక్టర్ రాజేశం హెచ్చరించారు.
- అదనపు కలెక్టర్ రాజేశం
వాంకిడి, జూన్ 17: ప్రభుత్వం ప్రవేశపెడు తున్న సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠినచర్యలు తీసుకుంటామని అద నపుకలెక్టర్ రాజేశం హెచ్చరించారు. గురువారం మండలపరిషత్ కార్యాలయంలో వివిధ పథకా లపై సర్పంచులతో సమీక్షా సమావేశాన్ని నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల అమలులో వాంకిడి మండలం వెనుక బడి ఉందన్నారు. మండలంలో నేటికీ వైకుంఠదా మాలు, పల్లెప్రకృతి వనాలు పూర్తి కాలేదన్నారు. మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టిసారించాలని అన్నారు. పథకాల అమలులో నిర్లక్ష్యం వహిస్తే సర్పంచులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిం చారు. డీఎల్పీవో రమేష్, ఎంపీడీవో వెంటేశ్వర్రెడ్డి, తహసీల్దార్ మధుకర్, ఎంపీవో వివకుమార్, డీపీఎ రామకృష్ణ, ఈజీఎస్ ఏపీఎం శాఖిర్ ఉస్మానియా, సర్పంచ్లు పాల్గొన్నారు.