విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
ABN , First Publish Date - 2022-06-28T05:49:18+05:30 IST
విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
పెద్దేముల్, జూన్ 27: విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని డిప్యూటీ సీఈవో సుభాషిణి పేర్కొన్నారు. సోమవారం పెద్దేముల్ మండల పరిషత్ కార్యాలయాన్ని ఆమె తనిఖీ చేశారు. కార్యాలయంలో వివిధ అభివృద్ధి పనుల రికార్డులు, అధికారులు, సిబ్బంది అటెండెన్స్ రిజిష్టర్లను పరిశీలించారు. పంచాయతీ కార్యదర్శులు తప్పనిసరిగా గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఎంపీడీవో, ఎంపీఈవోలు గ్రామాల్లో పర్యటించి క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని తెలిపారు.