విద్యార్థులతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు

ABN , First Publish Date - 2022-09-23T05:30:00+05:30 IST

ఎవరైనా సరే విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని ఎంపీపీ సాయిలు హెచ్చరించారు.

విద్యార్థులతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు
పాఠశాలలోని మురుగును పరిశీలిస్తున్న ప్రజాప్రతినిఽధులు

















మిరుదొడ్డి, సెప్టెంబరు 23: ఎవరైనా సరే విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని ఎంపీపీ సాయిలు హెచ్చరించారు. శుక్రవారం మిరుదొడ్డిలోని కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలను ఆత్మకమిటీ చైర్మన్‌ భాస్కరచారితో కలిసి ఆకస్మీకంగా తనీఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. పాఠశాల ఆవరణలో మురుగు నీరు నిల్వ ఉండడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సొంత నిఽధులతో గుంతల్లో మొరాన్ని పొయిస్తానన్నారు. వారి వెంట ఎంపీడీవో రాజిరెడ్డి, ఎంఈవో ప్రభుదాస్‌,  సర్పంచు శ్రీనివాస్‌, సిబ్బంది తదితరులున్నారు. 


Updated Date - 2022-09-23T05:30:00+05:30 IST