విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

ABN , First Publish Date - 2022-07-05T04:19:29+05:30 IST

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌ ఉపాధ్యాయులను హెచ్చరించారు. గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఆదివారం హెచ్‌ఎం, వార్డెన్‌ అందుబాటులో లేకపోవడంతో లంబాడీల ఐక్యవేదిక నాయకులు ఫిర్యాదు చేయడంతో స్పందించిన ఆయన సోమవారం పాఠశాలను సందర్శించారు.

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
విద్యార్థులతో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌

కోటపల్లి, జూలై 4: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌ ఉపాధ్యాయులను హెచ్చరించారు. గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఆదివారం హెచ్‌ఎం, వార్డెన్‌ అందుబాటులో లేకపోవడంతో  లంబాడీల ఐక్యవేదిక నాయకులు ఫిర్యాదు చేయడంతో స్పందించిన ఆయన సోమవారం  పాఠశాలను సందర్శించారు.  స్నానపు గదులు సరిపోవడం లేదని, మరుగుదొడ్లు శుభ్రంగా లేవని, తాగునీటి సమస్యలు ఎదురవుతున్నాయని విద్యా ర్థులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ ఉపాధ్యా యులు అందుబాటులో ఉండాలన్నారు. ఎంపీడీవో భాస్కర్‌, తహసీల్దార్‌ సునీల్‌ కుమార్‌, పోలీసు శాఖ అధికారులతో మాట్లాడారు. వసతి గృహం సమీపంలో రాత్రి వేళ అల్లరి మూకలు తిరుగుతున్నాయని,  ప్రత్యేక నిఘా పెట్టాలని పోలీసు లకు సూచించారు. ఏటీడీవో చిరంజీవి, ఎంపీపీ మంత్రి సురేఖరామయ్య, తహసీ ల్దార్‌ సునీల్‌కుమార్‌, హెచ్‌ఎం సత్యనారాయణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలకు మహిళా హెచ్‌ఎం, మహిళా వార్డెన్‌లను నియమించాలని అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌కు లంబాడీల ఐక్యవేదిక నాయకులు సమ్మయ్యనాయక్‌, బాపు నాయక్‌లు వినతి పత్రం అందించారు. 

 

Updated Date - 2022-07-05T04:19:29+05:30 IST