మిడతల దండు నివారణకు చర్యలు చేపట్టాలి

ABN , First Publish Date - 2020-05-28T10:57:40+05:30 IST

జిల్లాలో మిడతల దండు నివారణకు ముమ్మర చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సూచించారు.

మిడతల దండు నివారణకు చర్యలు చేపట్టాలి

కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి ఫ అధికారులతో సమీక్ష


ఖిల్లా, మే 27: జిల్లాలో మిడతల దండు నివారణకు ముమ్మర చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సూచించారు. కలెక్టరేట్‌లో బుధవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉత్తరాది రాష్ట్రాల్లో మిడతల దండు ప్రభావం ఎక్కువగా ఉందన్నారు. మహారాష్ట్రలోని అమరావతిలో ఆ దండు చేరుకుందని, జిల్లాలో అడ్డుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మిడతల దండు దాడిచేస్తే పంటలకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ప్రత్యేక వాతావరణ పరిస్థితుల్లో మిడతలు విజృంభిస్తాయని తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు సూచించి విధంగా వేప రసాయనాలు పంటలపై పిచికారి చేయాలన్నారు. కినోల్‌పాస్‌ లేదా క్లోరోపైరిపాస్‌  పొడి మందులను హెక్టారుకు 25 కిలోల చొప్పున పంటలపై చల్లాలన్నారు. రైతులు మిడతల దండుతో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ కోరారు. పొలాల గట్లపైన కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలన్నారు. గుడ్డు, పిల్లదశ కనిపిస్తే బయోపెస్టిసైడ్‌ ఉపయోగించాలని కోరారు. సమీక్షలో మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ జితేష్‌ వి పాటిల్‌, అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, బి.ఎస్‌.లత, జిల్లా అటవీ శాఖాధికారి సునీల్‌, అఽధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-28T10:57:40+05:30 IST