చెట్లు నరికిన వారిపై చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2021-09-17T05:00:22+05:30 IST

అకారణంగా చెట్లను నరికివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ మేడి మధుసూదన్‌రావు అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.

చెట్లు నరికిన వారిపై చర్యలు తీసుకోవాలి
సత్యసాయి ఆలయం వద్ద చెట్లను నరికివేసిన దృశ్యం

మెదక్‌ మున్సిపాలిటీ, సెప్టెంబరు 16: అకారణంగా చెట్లను నరికివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ మేడి మధుసూదన్‌రావు అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. తొమ్మిదో వార్డులోని సత్యసాయి ఆలయం వద్ద ఏపుగా పెరిగిన చెట్లను అనవసరంగా కొంతమంది నరికివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై అటవీశాఖ, మున్సిపల్‌  అధికారులు బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ విషయంపై కలెక్టర్‌కు సైతం ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. 

Updated Date - 2021-09-17T05:00:22+05:30 IST