మల్లారెడ్డి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2021-06-19T05:51:18+05:30 IST

మల్లారెడ్డి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సందబోయిన ఎల్లయ్య డిమాండ్‌ చేశారు.

మల్లారెడ్డి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి
గజ్వేల్‌లోని సీపీఎం కార్యాలయంలో మాట్లాడుతున్న ఎల్లయ్య

ముంపు గ్రామాల ప్రజలందరికీ పూర్తి నష్టపరిహారం ఇవ్వాలి

సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సందబోయిన ఎల్లయ్య

గజ్వేల్‌, జూన్‌ 18: మల్లారెడ్డి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సందబోయిన ఎల్లయ్య డిమాండ్‌ చేశారు. గజ్వేల్‌లోని సీపీఎం కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. తొగుట మండలం వేములఘాట్‌ గ్రామానికి చెందిన తూటుకురి మల్లారెడ్డి సజీవ దాహననికి కారణమైన వారిపై చర్యలు తీసుకుని క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. ముంపు గ్రామా ల్లో సమగ్రంగా సర్వే చేయకుండా అడ్డుపడుతున్న వారిపై, ఇందుకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ముంపు గ్రామాల ప్రజలకు పూర్తి నష్టపరిహారం ఇవ్వకుండా మానసికవేదనకు గురిచేస్తున్నారన్నారు. ఇప్పటికైనా సర్వం కోల్పోయిన నిర్వాసితులందరికీ ప్రభుత్వం చెప్పిన వి ధంగా నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ప్రజలను సమీకరించి పోరాటం నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బండ్ల స్వామి, యాదగిరి ఉన్నారు.

Updated Date - 2021-06-19T05:51:18+05:30 IST